Friday, May 3, 2024
- Advertisement -

ఇలాగైతే వ‌రల్డ్ క‌ప్‌కు భార‌త్ క‌ష్ట‌మే…

- Advertisement -

టెస్టుల్లో నెంబర్ వన్ జట్టు హోదాలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. స్వదేశంలో ప్రత్యర్థులను గడగడలాడించిన భారత్.. సఫారీ గడ్డపై ఎలా ఆడుతుందో అని భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అక్కడ జరుగుతున్న పోటీ భారత్, దక్షిణాఫ్రికాల మధ్యలా అనిపించడంలేదు.. కోహ్లీకి, సఫారీలకు మధ్యలా అనిపిస్తోంది.

టెస్ట్‌, వ‌న్డేమ్యాచ్‌ల‌లో గ‌ణాంకాలు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి .కోహ్లీతో పాటు మరో ఢిల్లీ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ తప్ప మరే ఇతర బ్యాట్స్‌మన్ సఫారీ గడ్డపై రాణించలేకపోతున్నారు. ఒక్క బ్యాట్స్‌మేన్ మీద‌నే ఆట అంతా ఆధార‌పడ‌టం టీమిండియాకు మంచిది కాద‌నే భావ‌నను వ్య‌క్తం చేస్తున్నారు విశ్లేష‌కులు.

మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ చూసుకుంటే భారత్ నుంచి సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు టెస్ట్ సిరీస్‌లో టాప్ స్కోరర్ కూడా విరాటే. 47.66 సగటుతో కోహ్లీ 286 పరుగులు చేశాడు. ఆ తరవాత భారత్ నుంచి హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇతను 19.83 సగటుతో 119 పరుగులు చేశాడు. ఈ మొత్తం 93 పరుగులు సెంచూరియన్ టెస్టులో చేసినవే. మిగిలిన ఇన్నింగ్స్‌లలో 26 పరుగులు మాత్రమే చేశాడు. పాండ్యా తరవాత మురళీ విజయ్ (102 పరుగులు, సగటు 17), ఛటేశ్వర్ పుజారా (100 పరుగులు, సగటు 16.66), భువనేశ్వర్ కుమార్ (101 పరుగులు, సగటు 33.66) మాత్రమే 100 పరుగుల మార్కును అందుకోగలిగారు. అయితే ఈ సిరీస్‌లో బ్యాట్స్‌మెన్ కన్నా బౌలర్లే ఎక్కువ ప్రభావం చూపారు. అందుకే బ్యాట్స్‌మెన్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఇక వన్డేల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగులోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు వన్డే మ్యాచుల్లో రెండు సెంచరీలు, 75, 46 నాటౌట్‌తో విరాట్ కోహ్లీ 393 పరుగులు సాధించాడు. సగటు 196.50 కావడం విశేషం. ఇక్కడ కూడా అత్యధిక పరుగులు విరాట్‌వే. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాకుండా ఈ మధ్య కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. నాలుగు మ్యాచుల్లో కలిపి కేవలం 40 పరుగులు (సగటు 10) మాత్రమే సాధించాడు. కోహ్లీ తరవాత రెండు అర్ధసెంచరీలు, ఒక సెంచరీతో ధావన్ సిరీస్‌లో రెండో అత్యధిక స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

తొలి వన్డేలో 79 పరుగులతో ఆకట్టుకున్న ఆజింక్య రహానే కూడా ఆ తరవాత వచ్చి అవకాశాలను చేజార్చుకున్నాడు. నాలుగు మ్యాచుల్లో కలిపి 98 పరుగులు (3 ఇన్నింగ్స్) మాత్రమే చేయగలిగాడు. ఇక భారీ అంచనాలతో సఫారీ టూర్‌కు వెళ్లిన హార్దిక్ పాండ్యా కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తం మూడు ఇన్నింగ్స్‌ల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన శ్రేయాస్ అయ్యర్ 18 పరుగులు చేయడం విశేషం.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 90ల నాటి టీమిండియా గుర్తుకు వస్తోంది. అప్పట్లో విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు సచిన్ టెండూల్కర్ వికెట్ తీస్తే చాలు టీమిండియా పని అయిపోయినట్లే అని ప్రత్యర్థులు భావించేవారు. ఇప్పుడు అదే రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచుల్లో కోహ్లీ పరుగులు తీసేస్తే టీమిండియా బ్యాట్స్‌మెన్ చేసిన పరుగులు ఏమాత్రం.

మరో 16 నెలల్లో ప్రపంచ కప్ జరగబోతోంది. ఈ మేజర్ టోర్నీకి టీమిండియా ఎంతో దృఢంగా సన్నద్ధం కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ మొత్తం కెప్టెన్‌పైనే ఆధారపడటం మంచి కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా మిగిలిన బ్యాట్స్‌మెన్ పుంజుకోకుంటే వ‌రల్డ్‌క‌ప్‌ను సాధించ‌డం మాత్రం క‌ష్టమ‌నే చెప్ప‌వ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -