Monday, April 29, 2024
- Advertisement -

పేరు మార‌నున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్…

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌ ఆటగాళ్ల వేలంలో భారీ ధరకి స్టార్ క్రికెటర్లని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసి చేసింది. బెంగళూరు వేదికగా గత శని, ఆదివారం జరిగిన ఈ వేలంలో రూ. 11 కోట్లకి ఓపెనర్ కేఎల్ రాహుల్‌‌ని దక్కించుకున్న పంజాబ్.. రవిచంద్రన్ అశ్విన్ (రూ.7.6కోట్లు), ఆండ్రూ టై (రూ.7.2కోట్లు), అరోన్ ఫించ్ (రూ.6.2 కోట్లు), స్టాయినిస్ (రూ.6.2కోట్లు), కరుణ్ నాయర్ (రూ.5.6కోట్లు), క్రిస్‌గేల్ (రూ.2కోట్లు) కొనుగోలుతో జట్టుని బలిష్టం చేసుకుంది.

గత మూడు సీజన్లలోనూ జట్టు ప్రదర్శన పేవ‌లంగా ఉండ‌టంతో ఫ్రాంఛైజీ ఈ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నాన్య‌మైన ఆట‌గాల్ల‌ను ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. అంతే కాకుండా ఈ ఏడాది సీజన్‌కి జట్టు పేరుని కూడా మార్చాలని ఫ్రాంఛైజీ యోచిస్తోందట. ఈ మేరకు బీసీసీఐకి ఇప్పటికే పేరు మార్పుపై దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకసారి మాత్రమే ఫైనల్ చేరిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. 2014 నుంచి కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. దీంతో వేలంలో మ్యాచ్‌ల్ని గెలిపించే ఆటగాళ్లపైనే ఫ్రాంఛైజీ ఎక్కువగా దృష్టి సారించి దక్కించుకుంది. ఆటగాళ్ల మార్పుతో పాటు జట్టు పేరు మార్పు పంజాబ్‌కి ఏ మేరకు టైటిల్‌ని తెచ్చిపెడుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -