ఐపీఎల్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 162 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్(2) నిరాశ పరిచాడు. మరో ఓపెనర్ పెనర్ క్రిస్ లిన్ (82, 51 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులు) ఒంటరి పోరాట చేశాడు. భారీ స్కోరు దిశగా తూసుకెల్తున్న కేకేఆర్ను చెన్నై స్పిన్ బౌలర్ ఇమ్రాన్తాహిర్ నాలుగు కీలక వికెట్లు తీసి కోల్కతా బ్యాట్స్మెన్ను కట్టడిచేశాడు.శార్దుల్ ఠాకుర్ రెండు, మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశారు.
ఫస్ట్ డౌన్లో వచ్చిన నితీశ్ రాణా(21) మోసర్తుగా ఆడగా, రాబిన్ ఊతప్ప గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. తరువాత ఎవరు రాణించకపోవడంతో తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. ఆండ్రీ రసెల్(10), దినేశ్ కార్తీక్(18), శుభ్మన్ గిల్(15)సైతం విఫలమయ్యారు. దీంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.