ఐపీఎల్ తాజా సీజన్లో టీండియా కెప్టెన్, మాజీ కెప్టెన్ల పోరుకు ఆదివారం తెరలేపనుంది. ధోని వర్సెస్ కోహ్లీ ఫైట్కు అన్ని రెడీ అయ్యాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ధోని సారథ్యంలోని చైన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోహ్లీ కెప్టెన్గా వ్యవహారిస్తున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు పరిస్థితి దీనికి పూర్తి విరుద్దంగా ఉంది. కేవలం రెండు మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
ఈ జట్ల మధ్య ఆదివారం నాడు మ్యాచ్ జరగనుంది. ఈ ఐపీఎల్ సీజన్లో జరిగిన మొదటి మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్పై చైన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్లో విజయం సాధించి ధోనిసేనపై పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు కోహ్లీ. కోల్కతాతో జరిగిన గత మ్యాచ్లో సెంచరీతో తమ జట్టుకు విజయాన్నిందించాడు. సనరైజర్స్ మ్యాచ్లో చైన్నై జట్టు ఓడిపోయింది. అయితే ఇరు జట్ల హోరాహోరి పోరు తప్పదని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.