ఐపీఎల్ 2020 వేలం కోల్కతాలో పూర్తయింది. రాజస్థాన్ రాయల్స్ మొత్తం 25 ఆటగాళ్లతో కూడిన జట్టును తయారుచేసుకుంది. 25 మందిలో 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రాబిన్ ఉతప్ప, జైదేవ్ ఉనాద్కట్లకు కోసం 3.0 కోట్లు ఖర్చు చేసింది. యశస్వి జైస్వాల్ రూ. 2.4 కోట్లు, కార్తీక్ త్యాగిని రూ. 1.3 కోట్లకు తీసుకోగా.. టామ్ కరన్, ఆండ్రూ టైలను 1.0 కోటికి దక్కించుకుంది.
అనుజ్ రావత్ (రూ. 80 లక్షలు), డేవిడ్ మిల్లర్ (రూ. 75 లక్షలు), ఒషానే థామస్ (రూ. 50 లక్షలు), అనిరుధ అశోక్ జోషి (రూ. 20 లక్షలు), ఆకాశ్ సింగ్ (రూ. 20 లక్షలు)లను రాజస్థాన్ తక్కువకే సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ను కూడా రూ. 75 లక్షలకు దక్కించుకోవడం విశేషం. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్ మొత్తం రూ .29.90 కోట్లు ఖర్చు చేసింది.
ఇక రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు విషయంకు వస్తే.. స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, సంజు సామ్సన్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, మహిపాల్ లోమోర్, వరుణ్ ఆరోన్, మనన్ వోహ్రా, రాహుల్ తెవాటియా, అంకిత్ రాజ్పూత్, మయాంక్ మార్కండే, రాబిన్ ఉతప్ప, జైదేవ్ ఉనాద్కట్, యశస్వి జైస్వాల్, కార్తీక్ త్యాగి, టామ్ కరన్, ఆండ్రూ టై, అనుజ్ రావత్, డేవిడ్ మిల్లర్, ఒషానే థామస్, అనిరుధ అశోక్ జోషి, ఆకాశ్ సింగ్.