తెలంగాణలో కొంత కాలంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కాటుకు ఎంతో మంది రాజకీయ నేతలు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా రామాయంపేట మాజీ శాసన సభ్యుడు, మాజీ శాసన మండలి సభ్యుడు, మాజీ జెడ్పీ చైర్మన్ రాజయ్యగారి ముత్యంరెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు.
గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన స్వస్థలం చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామం. 1978లో రామాయంపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు.
1980లో ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి అంజయ్య కోసం ముత్యంరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ముత్యం రెడ్డి ఇక లేరు అన్న విషయం తెలుసుకొని కామారం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
టివి నటుడు రాజేష్ దత్త పై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య!