ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీ పరాజయాల పరంపర కొనసాగుతోంది. లక్నోతో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది ఆర్సీబీ. లక్నో విధించిన 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య చేధనలో ఆర్సీబీ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. లొమ్రోర్ 33,రజత్ 29,విరాట్ 22 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్మెన్ అంతా విఫలమయ్యారు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. 3/14తో బెంగళూరు ఓటమిని శాసించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు మయాంక్.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. డికాక్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 , పూరన్ 21 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 40 నాటౌట్గా నిలిచారు. ఆర్సీబీ హోం గ్రౌండ్లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.