ఐపీఎల్-12లో లీగ్ దశ పూర్తి అయి మరో రసవత్తర సమరానికి వేళైంది. మంగళవారం జరిగే క్వాలిఫయర్-1లో భాగంగా భాగంగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ ఢీకొనబోతున్నాయి. రెండు జట్లూ బలమైనవే. రెండింటికీ ఘన చరిత్రే ఉంది. చెరో మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్నాయి.
అయితే చెన్నై కొంత ఆందోళనలో ఉంది. లీగ్ దశలో రెండుసార్లు ఈ జట్లు తలపడగా.. రెండు మ్యాచ్ల్లోనూ చెన్నైని చిత్తుగా ఓడించిన ముంబయి మరోసారి అదే జోరుని కొనసాగించి ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు లీగ్ దశ పరాజయాలకి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై ఆశిస్తోంది. ఈ మ్యాచ్లో ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.
ఐపీఎల్ 12 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకూ 26సార్లు ఈ రెండు జట్లూ తలపడగా.. ముంబయి ఏకంగా 15 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. చెన్నై 11 మ్యాచ్ల్లో గెలిచింది.చెన్నై సొంతగడ్డ చెపాక్లో 2010 నుంచి ఒక్కసారి కూడా చెన్నై చేతిలో ముంబయి ఓడిపోలేదు. దీంతో.. ఈరోజు మ్యాచ్లో చెన్నైపైనే ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.