- Advertisement -
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరుతో దుబాయ్లో క్రికెట్ అకాడమీ ప్రారంభం కానుంది. ఈనెల 11 న ధోని చేతులమీదుగా ఈ అకాడమీని ప్రారంభించనున్నారు. దుబాయ్ కు చెందిన ‘పసిఫిక్ వెంచర్స్’ తో కలిసి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఈ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సందర్భంగా పసిఫిక్ వెంచర్స్’ డైరెక్టర్ పర్వేజ్ ఖాన్ మాట్లాడుతూ, ధోనీతో కలిసి పని చేయనుండటం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ అకాడమీని 11వ తేదీన ధోనీ ప్రారంభించనున్నాడని చెప్పారు.యూఏఈలో క్రికెట్ ను ప్రోత్సహించే క్రమంలో భాగంగా ఈ అకాడమీని ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్ లో దక్షిణాఫ్రికా, యూకేలకూ తమ అకాడమీలను విస్తరించే ఆలోచనలో ఉన్నామని అన్నారు. ఈ నెల 12న పలువురు అగ్రశ్రేణి క్రికెటర్లతో తమ అకాడమీలోని ఆటగాళ్లకు ముఖాముఖి కార్యక్రమాన్ని ధోనీ నిర్వహించనున్నట్టు చెప్పారు.