టీమిండియా కెప్టెన్ విసిరిన ఫిట్నెస్ ఛాలెంజ్కు ప్రధాని సై అన్నారు. విరాట్.. నువ్వు విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నా. త్వరలోనే నా ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియోను షేర్ చేస్తానంటూ కోహ్లి ట్వీట్కు ప్రధాని బదులిచ్చారు.
ఇటీవల కేంద్ర క్రీడల శాఖా మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ పుష్ అప్స్ చేస్తున్న వీడియోను ఫిట్నెస్ మంత్ర పేరుతో ట్విటర్లో పోస్ట్ చేస్తూ భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్ను ట్యాగ్ చేశారు. అయితే దీనిపై స్పందిస్తూ విరాట్ తాను చేస్తున్న ఎక్సర్సైజ్ వీడియోను పోస్ట్ చేశాడు. అంతేకాకుండా తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, మహేంద్ర సింగ్ ధోనిలు ఈ ఛాలెంజ్ స్వీకరించాలంటూ ట్యాగ్ చేశాడు.
అంతకు ముందు ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ను కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రారంభించారు. మనం ఫిట్గా ఉంటే ఇండియా ఫిట్గా ఉంటుందనే హ్యాష్ట్యాగ్తో తను ఎక్సర్సైజ్ చేసిన వీడియోను పోస్ట్ చేసిన రాథోడ్.. హృతిక్ రోషన్, విరాట్ కోహ్లి, సైనా నెహ్వాల్లకు ఛాలెంజ్ విసిరాడు. ఈ సవాల్ను స్వీకరించిన కోహ్లి.. ప్రధానిని ట్యాగ్ చేస్తూ.. తన ఫిట్నెస్ ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక తన ముందున్న సవాల్ కు సిద్ధమేనని, దాన్ని పూర్తి చేసి, ఆ వీడియోను షేర్ చేస్తానని మోదీ ట్వీట్ చేశారు.
I have accepted the #FitnessChallenge by @ra_THORe sir. Now I would like to challenge my wife @AnushkaSharma , our PM @narendramodi ji and @msdhoni Bhai for the same. 😀 #HumFitTohIndiaFit #ComeOutAndPlay pic.twitter.com/e9BAToE6bg
— Virat Kohli (@imVkohli) May 23, 2018