Tuesday, May 21, 2024
- Advertisement -

ఆ విష‌యంలో పూజారాదే త‌ప్పు :ర‌హానే

- Advertisement -

ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మొద‌టి బ్యాటింగ్ చేసిన ఇండియా 107 ప‌రుగుల‌కు అలౌట్ అయింది.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లిసేన ఇంగ్లీష్‌ స్వింగ్‌కు తడబడి 107 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆట అనంతరం రహానే మీడియాతో మాట్లాడుతూ.. రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు సైతం రాణిస్తారని వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు. పరిస్థితులు మొత్తం ఇంగ్లండ్‌కు అనుకూలించాయి.

అండర్సన్‌, బ్రాడ్‌, వోక్స్‌లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పిచ్‌పై పచ్చిక ఉండటంతో​ బంతి బాగా స్వింగ్‌ అయింది. ఇక పూజారా రనౌట్‌ విషయంలో అతనిదే తప్పు. అతను రనౌట్‌ అయినప్పుడు చాలా బాధపడి ఉంటాడు. ఈ వికెట్‌ టీమిండియా బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. వర్షం అంతరాయంతో తొలి రోజు ఆట నిలిచిపోగా.. రెండో రోజు ఆట సైతం వరణుడి అడ్డంకితోనే కొనసాగింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -