ధోని అంపైర్ల నుంచి బంతి ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు క్రీడా అభిమానులను గురి చేస్తున్న గందరగోళం. ఇంగ్లండ్తో నిర్ణయాత్మకమైన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓటమి చెందడంతో టీమిండియా వన్డే సిరీస్ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ముగియగానే ఆటగాళ్లందరు మైదానాన్ని వీడుతున్న సమయంలో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని.. అంపైర్లను అడిగి మరి బంతి తీసుకున్నాడు.ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి చెక్ పెట్టాడు.
బుధవారం ఓ ప్రముఖ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ధోని రిటైర్మెంట్ వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియాతో అతడు ఇంకొంత కాలం ప్రయాణిస్తాడు. బంతిని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్కు చూపించడానికే తీసుకున్నాడు. మ్యాచ్లో బంతితో పడిన ఇబ్బందుల గురించి చెప్పడానికి ఒక జనరల్ ఐడియా కోసం తీసకున్నాడే తప్పా ఏ రిటైర్మెంట్ ఉద్దేశం లేదు’ అంటూ రవిశాస్త్రి ‘ధోని-బంతి’ మిస్టరీపై వివరణ ఇచ్చారు.