Monday, May 13, 2024
- Advertisement -

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయ‌ల్ ఛాలంజ‌ర్స్ బెంగులూరు…

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో నాలుగు మ్యాచ్‌లాడిన రెండు జట్లూ ఒకదాంట్లో మాత్రమే గెలుపొంది.. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.

బెంగళూరు తుది జట్టులో ఒక మార్పు జరిగింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు వేసిన బెంగళూరు కెప్టెన్ కోహ్లి తుది జట్టులోకి మనన్ వోహ్రాని తీసుకున్నాడు. మరోవైపు ఢిల్లీ జట్టులోనూ ఒక మార్పు జరిగింది. మహ్మద్ షమీ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చాడు.

బెంగళూరు జట్టు: డికాక్, మనన్ వోహ్రా, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, మన్‌దీప్ సింగ్, కోరె అండర్సన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్‌ వోక్స్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

ఢిల్లీ జట్టు: గౌతమ్ గంభీర్, జేసన్ రాయ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మాక్స్‌వెల్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, క్రిస్‌వోక్స్ , నదీమ్, హర్షల్ పటేల్, ట్రెంట్ బౌల్ట్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -