Thursday, May 9, 2024
- Advertisement -

రిషబ్ పంత్..రీఎంట్రీకి రంగం సిద్ధం!

- Advertisement -

టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా గాయం నుండి కోలుకున్న రిషబ్ ప్రాక్టీస్ కూడా షురూ చేశాడు. ఇక ఐపీఎల్ ద్వారా తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రిషబ్. ఈ నెల చివరలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ జరుగుతుండగా ఐపీఎల్ 2024 సీజన్ లో పునరాగమనం కోసం తీవ్రకసరత్తు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత నెలలో జాదవ్ పూర్ యూనివర్శిటీ సాల్ట్ లేక్ క్యాంపస్ పిచ్ లో శిక్షణా శిబిరంలో డీసీ సహచరులతో చేరాడు. ప్రస్తుతం తన బరువును తగ్గించుకొని ఫిట్ గా ఉండేందుకు పంత్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నాడు. రిషబ్ పంత్ ఐపీఎల్ టోర్నీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

గత ఏడాది జూన్ లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 సిరీస్ లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు పంత్. వన్డేలు, టెస్ట్‌లు, టీ20 సిరీస్‌లు ఆడిన పంత్ డాషింగ్ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్నారు.

https://www.instagram.com/rishabpant/?utm_source=ig_embed&ig_rid=f92fac0b-fac6-4cec-983d-9434f42f184e

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -