- Advertisement -
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలి మరో సార ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రేసులో గంగూలీకి పోటీగా ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక లాంచనం అయ్యింది.దాంతో పాటు గంగూలీ ప్యానల్కు పోటీగా కూడా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో అతని ప్యానల్ ఏకగ్రీవంగా ఎంపికైంది. గతవారం గంగూలీ ప్యానల్ నామినేషన్లు దాఖలు చేయగా, గురువారం ఈ ప్యానల్ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు క్యాబ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ప్రకటించారు. 2015లో తొలిసారి గంగూలీ క్యాబ్ చీఫ్గా ఎన్నికయ్యాడు. ఆ మరుసటి ఏడాది జగన్మోహన్ దాల్మియా మరణంతో దాదా అధ్యక్షుడయ్యాడు