Thursday, May 9, 2024
- Advertisement -

భార్య‌ల‌కు, గర్ల్‌ఫ్రెండ్స్‌ల‌కు దూరం కానున్న క్రికెట‌ర్లు…

- Advertisement -

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసే వ‌ర‌కు టీమిండియా క్రికెట‌ర్లు త‌మ భార్య‌ల‌కు, గ‌ర్ల‌ఫ్రెండ్‌ల‌కు దూరం కానున్నారు. టీమిండియా ఏదేశానికి టూర్ వెల్లిన వారి వెంట వారి భాగ‌స్వాములు, గ‌ర్ల‌ఫ్రెండ్స్ వెల్ల‌డం సాధార‌నం. టైం దొరికితే చెట్టాప‌ట్టాలేసుకొని వివ‌రిస్తుంటారు. తాజాగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో కూడా అదే సీన్ క‌నిపించ‌డంతో మేనేజ్ మెంట్ తీవ్రంగా స్పందింది.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్ సహా మరికొంత మంది క్రికెటర్లు తమ జీవిత భాగస్వాములతో సరదాగా గడిపారు. అయితే ఇప్పుడు వాళ్లకు దూరంగా గడపాల్సిన సమయం వచ్చింది. కనీసం నెల రోజులు మన క్రికెటర్లు వారి భాగస్వాములకు దూరం కానున్నారు

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఆటగాళ్లు వారి భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను దూరం పెట్టాలని జట్టు మేనేజ్‌మెంట్ సూచించింది. తొలి మూడు టెస్టులకు తమ జీవిత భాగస్వాములను తీసుకురావద్దని మేనేజ్‌మెంట్ కోహ్లీ సేనకు వెల్లడించింది. ఈ మేరకు ‘ముంబై మిర్రర్’ కథనాన్ని ప్రచురించింది.

గతంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో పర్యటనలకు వెళ్లినప్పుడు మన ఆటగాళ్లు పేలవ ప్రదర్శనలను ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మేనేజ్‌మెంట్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -