ఈ ఏడాది జూన్ నుండి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్, యూఎస్లో మ్యాచ్లు జరగనుండగా ఈ మెగా టోర్ని కంటే ముందే ఆఫ్ఘానిస్తాన్తో టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ మూడు టీ20ల సిరీస్కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. సీనియర్ ఆటగాళ్ళైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లను ఎంపిక చేస్తారా లేదా అన్న సందేహానికి చెక్ పెడుతూ తుది జట్టులోకి చోటు కల్పించారు సెలక్టర్లు.
2019 వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా టీ20 లకు దూరమైన వీరిద్దరూ ఐపీఎల్ మినహా ఇతర ఏ అంతర్జాతీయ టీ20లలో పాల్గొనలేదు. తొలిసారిఆ ఎట్టకేలకు అఫ్గాన్ టూర్ కు ఎంపిక కావడంతో జూన్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ కూడా వీరిద్దరూ ఆడటం ఖాయమైందనే చెప్పాలి. గాయం కారణంగా సూర్య కుమార్ ఈ సిరీస్కు దూరమయ్యాడు.
జట్టు : రోహిత్ శర్మ ( కెప్టెన్ ), గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, సంజూ శాంసన్, శివం దూబే, సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్,కుల్దిప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.