భారత క్రికెట్ కోచ్ కోసం వేట మొదలు పెట్టింది బీసీసీఐ.ప్రస్తుతం ఇండియాకు కోచ్గా ఉన్న కూంబ్లే కోచ్ పదవికాలం ముగియనుంది.తదుపరి కోచ్కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. టీమిండియా కోచ్కు అప్లికేషన్లు స్వీకరించడం బుధవారంతో ముగిసింది.
భారత్ మాజీ క్రికెటర్లు చాలా మంది కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు.
ప్రస్తుతం భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లేల మధ్య వచ్చిన మనస్పర్ధలు ఉన్న సంగతి తెలిసిందే.ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి.ఇండియా క్రికెట్ తదుపరి కోచ్గా ఆస్ట్రేలయాకు చెందిన టామ్మూడీని ఎంపిక చేసేఅవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అయితే కోహ్లీ….కూంబ్లేల మధ్య ఉన్న విబేధాలు టామ్ మూడికి లాభం చేకూర్చుతాయా అనుమానాలు కలుగుతున్నాయి.
{loadmodule mod_custom,Side Ad 1}
ప్రస్తుతానికి కోచ్ ఎవరనేది బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనప్పటికి… దరఖాస్తు చేసుకున్న హై ప్రొఫైల్ వ్యక్తుల్లో టామ్ మూడి ఒకరని తెలిసింది. కొత్త కోచ్ ఎంపిక విషయంపై మాట్లాడిన ఓ బీసీసీఐ అధికారి టామ్ మూడీకి చాన్స్ ఎక్కువగా ఉందని తెలిపారు. గతంలో కూడ మూడీ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కోచ్ పదవికి చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మూడీ గతంలో శ్రీలంకకు కోచ్ వ్యవహరించారని ఆయనకు భారత్ క్రికెట్ పరిస్ధితులపై మంచి అవగాహన ఉందని అన్నారు.అన్నీ కుదిరితే టామ్మూడీనే కోచ్గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read