ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా మాట్లాడుకొనేది విరాట్, అనుష్కల పెళ్లి గురించే. ఇటలీలో వీల్లద్దరు పెళ్లి చేసుకుంటున్నారని వచ్చిన వార్తలు నెట్లో హల్చల్ చేశాయి. మొదట్లో ఈ వార్తలను ఖండించిన ప్పటికి ఇప్పుడు మాత్రం మరో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. కోహ్లీ-అనుష్క పెళ్లికి ఇద్దరు క్రికెటర్లకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.
వాళ్ళిద్దరు ఎవరో కాదు క్రికెట్ దేవుడు సచిన్, ఇంకొకరు యువరాజ్సింగ్. మరో పక్క అనుష్కకూడా షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, ఆదిత్య చోప్రా, డైరెక్టర్ మనీశ్ శర్మను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నాలుగు నెలల క్రితమే డిసెంబరులో కోహ్లీ-అనుష్క వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారత్, శ్రీలంక వన్డే సిరీస్లో టీమిండియా బిజీగా ఉండనుండటంతో.. సచిన్, యువరాజ్లను మాత్రమే కోహ్లి తన పెళ్లికి ఆహ్వానించాడట. కుటుంబ సభ్యులు క్రికెట్ గాడ్ సచిన్, యువీలతోపాటు కోహ్లి బాల్య మిత్రులు, చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ మాత్రమే కోహ్లి పెళ్లికి హాజరవుతున్నారని విరాట్ సన్నిహితుడొకరు మెన్స్ ఎక్స్పీకి తెలిపారు. డిసెంబర్ 21 లేదా 22 తేదీల్లో విరుష్క జంట ముంబైలో రిసెప్షన్ పార్టీ ఇవ్వనుందట.