టీమిండియా సారథి కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ నాలుగోరోజు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న టెస్ట్లో కోహ్లీ ఆర్థశతకం సాధించారు. ఇది కోహ్లి టెస్టు కెరీర్ లో 15వ హాఫ్ సెంచరీ. కాగా, ఈడెన్ గార్డెన్ లో కోహ్లికి తొలి హాఫ్ సెంచరీ కావడం ఇక్కడ విశేషం.
ఇప్పటివరకూ తన టెస్టు కెరీర్ లో 17 సెంచరీలను కోహ్లి సాధించాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు సాధించిన కోహ్లి.. ఈడెన్ లో మాత్రం తొలిసారి సత్తాచాటాడు. భారత జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో కెప్టెన్ గా బాధ్యతాయుత ఆడుతూ ఒంటరి పోరాటం చేస్తున్నారు.
సోమవారం చివరి రోజు ఆటలో బ్యాటింగ్ కు దిగిన కోహ్లి లంచ్ తరువాత హాఫ్ సెంచరీ మార్కును చేరాడు.72 ఓవర్ లో గమగే వేసిన చివరి బంతిని ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ ప్రస్తుతం (102 బంతుల్లో 72) ఆటను కొనసాగిస్తున్నాడు.