దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి టెస్ట్లో భారత్ ఘోరంగా ఫరాజయం పాలయ్యింది. బౌలర్లు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించినా బ్యాట్సమేన్లు విఫలం అయ్యారు. ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. దీంతో కోహ్లీ వీరాభి మాని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు.
మ్యాచ్లో కోహ్లీ ఐదు పరుగులకే ఔట్ అయ్యాడనే మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన అభిమాని మృతి చెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లం జిల్లాకు చెందిన 63 ఏళ్ల బాబులాల్ భైరవ విరాట్కు వీరాభిమాని. విరాట్ ఆడే మ్యాచ్లను క్రమం తప్పకుండా చూస్తూంటాడు బాబులాల్. ఈ క్రమంలోనే తొలి టెస్ట్ మ్యాచ్ కూడా బాబులాల్ ఒంటరిగా కూర్చొని చూశాడు. అయితే ఈ మ్యాచ్లో అదరగొడతాడని భావించిన కోహ్లి కేవలం ఐదు పరుగులు చేసి నిరాశపరిచాడు.
దాంతో నిరాశకు గురైన బాబులాల్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఈ ఘటనలో బాబులాల్ తల, చేతులు, కాళ్ల భాగాలు తీవ్రంగా గాయపడటంతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.