ఆప్ఘానిస్తాన్తో ఇవాళ టీమిండియా రెండో టీ20లో తలపడనుంది. తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా తొలి మ్యాచ్కు వ్యక్తిగత కారణాలతో దూరమైన ఇవాళ రెండో మ్యాచ్కు అందుబాటులోకి రానున్నారు విరాట్ కోహ్లీ.
దాదాపు 14 నెలల తర్వాత టీ20 మ్యాచ్ ఆడనున్నారు విరాట్. ఇండోర్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం కావడంతో పాటు బౌండరి చిన్నది కావడంతో పరుగుల పండగే కానుంది. ఓపెనింగ్ స్థానం కోసం గిల్, జైస్వాల్ మధ్య పోటీ ఉండనుంది. మిడిలార్డర్లో యువ ఆటగాళ్లు శివమ్ దూబే, రింకూసింగ్, జితేశ్ శర్మ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్లో మరోసారి ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల ప్లాన్కే పరిమితం కావచ్చు. తొలి మ్యాచ్లో టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చిన ఆప్ఘాన్ ఈ మ్యాచ్లో గెలవాలనే కసితో ఉంది.
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్/జైస్వాల్, కోహ్లీ, దూబే, రింకూ, జితేశ్, అక్షర్, సుందర్, కుల్దీప్/రవి, అర్ష్దీప్, ముఖేశ్.
అఫ్గానిస్థాన్: ఇబ్రహీం (కెప్టెన్), రహ్మానుల్లా, హష్మతుల్లా, అజ్మతుల్లా, నబీ, నజీబుల్లా, కరీమ్, నైబ్, ముజీబ్, నవీన్, ఫజల్