Monday, May 6, 2024
- Advertisement -

బ్యాటింగ్‌లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలం అయ్యాం…విరాట్‌కోహ్లీ

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం చవి చూసింది. తద్వారా మరో టెస్టు ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది. సిరీస్ ఓట‌మిపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందించారు.

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో వచ్చిన ఫలితమే సెంచూరియన్‌ టెస్టులోనూ పునరావృతమైంది. 287 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 151 పరుగులకే ఆలౌట్‌ కావడంతో మరో టెస్ట్‌మిగిలుండగానే టీమిండియా 0-2 తేడాతో సఫారీలకు సిరీస్‌ కోల్పోయిన విషయం తెలిసిందే.

టాస్‌కు ముందు చూసిన పిచ్‌, ప్రస్తుతం ఉన్న వికెట్‌కు చాలా వ్యత్యాసముందని జట్టు ఆటగాళ్లకు హెచ్చరించాను. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా తొలుత త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో పరిస్థితి అర్థమైంది. కానీ మా బ్యాటింగ్‌లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించలేకపోయామ‌న్నారు కోహ్లీ.

తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో చేసిన సెంచరీపై కోహ్లీ మాట్లాడుతూ.. ‘సెంచరీ చేసినా ఏం లాభం జట్టు ఓడిపోయింది కదా. జట్టు గెలుపు కోసం చేసిన 30 లేక 50 పరుగులైనా నాకు ఆనందాన్నిస్తాయ‌న్నారు. జట్టు గెలవని సందర్భంలో నా వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోను. మైదానంలో కాలుపెట్టానంటే దేశం కోసం పూర్తిస్థాయిలో రాణించేందుకు శ్రమిస్తాను. బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యాలతో సిరీస్‌ చేజార్చుకున్నాం. నామమాత్రమైన మూడో టెస్ట్‌ మ్యాచ్‌ జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -