మరికాసేపట్లో వరల్డ్ కప్ సంగ్రామంలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాలు ఆసక్తికర సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇండియా తన మొదటి మ్యాచ్ను సఫారీలతో తేల్చుకోనుంది. మ్యాచ్కి ముందే విరాట్ కోహ్లి, కగిసో రబాడ మధ్య మాటల యుద్ధం హీట్ని పెంచింది.
ఇటీవల రబాడా మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ ఇంకా ఎదగలేదని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ పోటీలను గుర్తు చేసుకున్న రబాడా, తన బౌలింగ్ లో ఫోర్ కొట్టిన కోహ్లీ ఏదో అన్నాడని, ఆపై తాను అవుట్ చేయగా, కోపాన్ని ప్రదర్శించాడని అన్నాడు. ఇతరుల్ని తిట్టడమే తప్ప.. తిట్లని స్వీకరించే పరిపక్వత అతనికి లేదని సఫారీ పేసర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.
తాజాగా మీడియా ముందుకు కోహ్లీ రావడంతో ఈ విషయంపై కోహ్లీ ఘాటుగానె సమాధానం ఇచ్చారు. తాను రబాడాతో చాలాసార్లు ఆడానని, ఆయన అన్న మాటలకు మైదానంలోనే సరైన సమాధానం చెబుతానని అన్నాడు. ఒకవేళ అతను నా గురించి ఏమైనా వ్యాఖ్యానించి ఉంటే..? అతనితోనే తేల్చుకుంటా. రబాడ మంచి నైపుణ్యమున్న బౌలర్. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించగల సామర్థ్యం అతనికి ఉంది. కాబట్టి.. మైదానంలో అతని ఎదుర్కొనే సమయంలో జాగురతతో ఉంటాం’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఇదిలావుండగా, నేటి మ్యాచ్ లో భుజం గాయం కారణంగా డేల్ స్టెయిన్ బరిలోకి దిగడంలేదు. గాయపడిన ఎంగిడి కూడా లేకుండానే సౌతాఫ్రికా బరిలోకి దిగుతోంది.