విశాఖ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సత్తాచాటాడు. ఓపెనర్గా వచ్చిన యశస్వీ డబుల్ సెంచరీతో సత్తాచాటాడు. ప్రస్తుతం 207 పరుగులతో క్రీజులో ఉండగా 7 సిక్స్లు, 19 ఫోర్లతో రాణించాడు. యశస్వీ రాణించడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ఓవర్ నైట్ స్కోరు 179 పరుగులతో వచ్చిన యశస్వీ దూకుడుగా ఆడి డబుల్ సెంచరీ చేశాడు.
ఇక రోహిత్ శర్మ మరోసారి నిరాశ పర్చాడు. 14 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన గిల్ కూడా (34) తక్కువ పరుగులకే నిష్క్రమించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా జైస్వాల్ మాత్రం ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నాడు.
అయ్యర్ (27), పాటిదార్ (32),అక్షర్ పటేల్ (27), శ్రీకర్ భరత్ (17) పరుగులు చేశారు. ప్రస్తుతం 7 వికెట్లు కొల్పోయి 381 పరుగులు చేసింది టీమిండియా.
జట్లు:
టీమిండియా : జైస్వాల్, రోహిత్ శర్మ, గిల్, పాటీదార్, అయ్యర్, శ్రీకర్ భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లాండ్ ; క్రాలే, బెన్ డకెట్, అలీ పోప్, జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బెన్ పోక్స్, రెహన్ అహ్మద్, టాం హర్ట్లి, సోయబ్ బషీర్, ఆండర్సన్.