Tuesday, May 21, 2024
- Advertisement -

షాకింగ్: ఇంట్లోనే జయలలితను చంపి.. నిజాలు బయట పెట్టిన మాజీ మంత్రి

- Advertisement -
Another Shocking News Revealed About Jayalalitha’s Death Mystery

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ముందు నుంచి అందరిలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలే నిజం అనేలా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే మరోసారి  ఈ అనుమానాలు నిజం అనేలా మరో వార్త సంచలనం సృష్టిస్తోంది.

ఆసుపత్రి చేరటానికి ముందే పోయెస్ గార్డెన్ లో దివంగత ముఖ్యమంత్రి జయలలితపై దడి జరిగిందని.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థితిలోనే ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారని మాజీ మంత్రి సంచలన వాఖ్యలు చేశారు. ఈ వాఖ్యలు చేసింది ఎవరో కాదు జయ కేబినెట్లో మంత్రిగా పని చేసిన సి.పొన్నయన కావడం విశేషం. ఆదివారం ఆయన పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సంచలన వాఖ్యలు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని.. అపోలో ఆసుపత్రిలో శశికళ ప్రణాళిక రచించిందని ఆయన కొన్ని సందేహాలు వ్యక్తపరిచారు. ఇది ఇలా ఉంటే ఆసుపత్రిలో జయలలితను చూడడానికి వెళ్ళినప్పుడు ఎవ్వరిని కూడా లోపలకి రానివ్వలేదని.. ఎవరైన లోపడికి వస్తే పలు అంటువ్యాధులు సోకుతాయని కూడా బెదిరించారని తెలిపారు. 73 రోజుల పాటు జయలలిత వద్దే గడిపారని చెబుతున్న శశికళకు అంటువ్యాధులు ఎందుకు సోకలేదో అర్థం కావటం లేదన్నారు. జయ మృతిపై అనుమానాలను న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు.

{youtube}rQpXj9B3-oI{/youtube}

Related

  1. కెమెరాకి కంటికి చిక్కిన జయలలిత ‘ఆత్మ’!
  2. ” జయలలిత ది సహజమరణం కాదు చంపేశారు ”
  3. జయలలిత మరణం వెనక సీక్రెట్స్ ఇవే!
  4. ప్రభుత్వానికి దిమ్మతిరిగే దెబ్బ కొట్టిన జియో .. ఎంత నష్టమో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -