ఏపీకి అప్పులు తెప్పలుగా వచ్చి పడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఏపీ ప్రభుత్వం లేదు. రాష్ట్ర ఖజానా నింపడం కోసం.. అధికారులంతా రోజుకు రెండు గంటలు ఓవర్ డూటీ చేయండి అని.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ప్రసంగంలోనూ చెప్పే మాటలే.
{loadmodule mod_custom,GA1}
కానీ ఒక్క విందు కోసం చంద్రబాబు సర్కార్ ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే వామ్మో అనకుండా ఉండలేరు. ఈ ఏడాది ఫిబ్రవరి 23,24 తేదీల్లో ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కమర్షియల్ అండ్ ఎమర్జింగ్ లాస్ అనే అంశంపై రెండు రోజుల పాటు అంతర్జాతీయ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సమావేశానికి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. వర్క్ షాప్ అనంతరం వీరికోసం సీఎం.. చంద్రబాబు నాయుడు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందులో.. కేవలం 19మంది మాత్రమే పాల్గొన్నారు. ఈ విందుకోసం ప్రభుత్వం రూ.13,38,720 ఖర్చు చేసింది. మరో రూ.4,90,705 లను వారి సదుపాయల నిర్వహణకు ఖర్చు చేసింది. మొత్తం 18,29,425 రూపాయలను ఏపీ ప్రభుత్వం వినియోగించింది. ఈ వివరాలన్నిటిని.. ఒక సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినవి.
{loadmodule mod_custom,GA2}
అయితే.. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రముఖులను ఆహ్వానించాల్సిన అవసరం వుంది. దాని కోసం ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కానీ ఒక్క విందుకోసమే లక్షల రూపాయల్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అనేది ప్రభుత్వ పెద్దలు ఓ సారి ఆలోచిస్తే మంచిదేమో అనేది రాష్ట్ర యువత సూచన.
{youtube}sL4nrFh894w{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related