నంద్యాల రాజకీయాలు మరో మలుపు తిరగనున్నాయి.ఇప్పటికే శిల్పా మోహన్రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.ఇదలా ఉండగా ఇప్పుడు జిల్లా టీడీపీలో మరో కుదుపు మొదలయ్యింది.చంద్రబాబు నాయుడు ఆటను మొదలు పెట్టారు.శిల్పా చక్రపాణిరెడ్డిన బయటకు పంపేందుకు బాబు రాజకీయ నాటకం మొదలెట్టేశాడు.
ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు చంద్రబాబు వస్తున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్సీ అయిన శిల్పా చక్రపాణిరెడ్డికి మాత్రం చంద్రబాబు పర్యటనకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వలేదు టీడీపీ నేతలు. ఎమ్మెల్సీ అయినప్పటికీ ఆయనకు ఆహ్వానం అందలేదు. దీంతో శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్రంగా నొచ్చుకున్నారు.
{loadmodule mod_custom,GA1}
చంద్రబాబు పర్యటన సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లలోనూ ఎక్కడా కూడా టీడీపీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి ఫొటోలు కనిపించకుండా చేశారు. కొద్ది రోజుల క్రితమే ఆయన్ను టీడీపీ జిల్లా అధ్యక్షపదవి నుంచి కూడా చంద్రబాబు తొలగించారు. ఇప్పుడు కనీసం చంద్రబాబు ఇప్తార్ విందు సమాచారం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. శిల్పామోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినందున శిల్పా చక్రపాణిరెడ్డికి పొగపెడుతున్నారని భావిస్తున్నారు.
శిల్పా మోహన్ రెడ్డి పార్టీ వీడిన తర్వాత చక్రపాణిరెడ్డితో మాట్లాడేందుకు కూడా టీడీపీ నేతలు జంకుతున్నారు. దీంతో ఆయన టీడీపీలో అంటరానివాడిలా ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు పర్యటనకు ఆయన్ను ఆహ్వానించకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.
{loadmodule mod_custom,GA2}
తీవ్ర మనస్థాపానికి గురైన శిల్పా చక్రపాణి తన అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నర్నయించారు.పార్టీలో ఉండాలా లేకా పార్టీకి గుడ్బాయ్ చెప్పాలనే యేచనలో ఉన్నట్లు సమాచారం.అన్న మాదిరే చక్రపాణి వైసీపీలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- భూమా ఫిక్స్…శిల్పా..?
- ఎప్పుడూ లేనిదే నంద్యాల నియేజకవర్గంమీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా….!
- నంద్యాల టీడీపీ ఖాలీ…. బాబు నాన్చుడు ధోరని కారనమా..?
- నంద్యాల ఉప ఎన్నికలో కొత్త ట్విస్ట్
{youtube}ACHKQwOU6tg{/youtube}