గ్యాంగ్ స్టర్ నయీం తూ సినిమా తీయడం కోసం రామ్ గోపాల్ వర్మ సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ లో చనిపోయిన నయీం జీవితాన్ని తెరమీద ఆవిష్కరించడానికి కేవలం ఒక్క కథ సరిపోదు అని అందుకే మూడు పార్ట్శ్ లో ఈ సినిమాని తీస్తాను అని ప్రకటించాడు డైరెక్టర్ వర్మ. సో ఈ లెక్కన చూసుకుంటే నయీం జీవితం లో రకరకాల యాంగిల్స్ ని వర్మ చూపించబోతున్నాడు.
అయితే బతికి ఉన్న తరుణం లో తాను హీరోగా చెయ్యాలి అని నయీం అనుకున్నాడు అట నయీం. పొలిటీషియన్ గా , హీరోగా చెయ్యాలి అని అతను ఆశ పడేవాడు. మొత్తానికి నయీం బతికుండా తీర్చుకోలేని ఆ సినిమా కోరిక, ఇప్పుడు మరణించాక నిజం కాబోతోందన్నమాట.
అయితే, ఆర్జీవీ మాటలు నీటి మూటలుగా ఉంటాయి! మరి, ఈ మాట మీద నిలబడి కచ్చితంగా చిత్రీకరిస్తారా లేదా అనేది కూడా కచ్చితంగా చెప్పలేం. షూటింగ్ మొదలైన తరువాత మాత్రమే దీన్ని నమ్ముదాం. ప్రస్తుతానికి ఆర్జీవీ మాటలు విందాం.. అంతే!