ఏపీ రాష్ట్ర మంత్రి,నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణ తనయుడు నిషిత్ నారాయణ ఇటివలే హైదరాబాద్ మహ్నగరంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36 లో జరిగిన ఘోర ప్రమాదానికి కు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. నిషిత్ నారాయణ మృతితో నారాయణ కుటుంబంలో పెను విషాదం నెలకొంది.
సీట్ బెల్ట్ పెట్టుకోక పోవటంతో పాటు 200లకు మించిన స్పీడ్ తో వెళ్తుండడంతో కారు అదుపు తప్పడంతో స్పీడ్ గా వెళ్తున్న కారు మేట్రో రైల్ ఫిల్లర్ కు ఢీకొట్టింది. దాంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. రెండు కోట్లు విలువ చేసే బెంజ్ కారు నుజ్జు నుజ్జయింది. బెంజ్ కారులు యాక్సిడెంట్ సమయంలో ప్రాణ నష్టం జరగకుండా సదుపాయాలు ఉంటాయి. కాని సీటు బెల్టు పెట్టుకోక నిషిత్ చనిపోయినట్లు తెలుస్తోంది. అధిక స్సీడ్, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే నిషిత్ చనిపోయాడని ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు అంతర్గత అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
{loadmodule mod_custom,Side Ad 1}
ఏది ఏమయినా ఈ ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నత కుటుంబాలకు చెందిన వారు తమ పిల్లల కార్యకలాపాలు, వాహన వేగం వంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలని ఈ ప్రమాదం గుణపాఠం చెప్పింది.
{youtube}9ZkNVrVbqrc{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related