రాష్ట్రంలో వాతా వరణం చల్లగా ఉన్నా నంద్యాల మాత్రం రాజకీయ వేడి కుతకుతలాడుతోంది.ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకున్నా అభ్యర్తులను ముందే ఇరు పార్టీలు ప్రకటించారు.అంతే ఇంకేముంది భూమా,శిల్పాలమధ్య సవాల్లు,ప్రతి సవాల్లు మొదలయ్యాయి.
దీంతో ఇప్పటినుంచే ఇలా ఉంటె ఎన్నికల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
{loadmodule mod_custom,GA1}
నంద్యాలలో ఓడిపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసురుతోంది. నంద్యాల ప్రజలు భూమా ఫ్యామిలీని గెలిపించేందుకు ఎదురు చూస్తున్నారని ఆమె అంటున్నారు. భూమా పేరు చెప్పి సెంటిమెంట్ను రాజేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. శిల్పాకూడా అదే పని చేస్తారని సవాల్ విసిరింది అఖిల ప్రియ.
అఖిల సవాల్కు వైసీపీ అభ్యర్తి శిల్పా మోహన్ రెడ్డికూడా అంతే రీతిలో స్పందించాడు.సవాల్ను స్తీకరిస్తున్నానని ప్రకటించారు.ఉప ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజకీయాలను వదిలేస్తానని ఈ ఉదయం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం అధికార బలం ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించే సమస్యే లేదని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటేనే భవిష్యత్తు ఉంటుదన్న నమ్మకం, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల భరోసాతోనే తాను పార్టీలో చేరానని అన్నారు.మొత్తానికి నంద్యాల ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది.
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- శిల్పా …అఖిల మద్య మాటల యుద్ధం….
- మా ఇలాకాలో మీపెత్తనమేంటి – భూమా అఖిలప్రియ
- మంత్రి పదవికి రాజీనామా చేస్తారా…..?
- అభ్యర్తిని ప్రకటించి చేతులు దులుపుకున్న బాబు…
{youtube}ISUSSwJHkaY{/youtube}