నంద్యాల ఉప ఎన్నిక టికెట్ అభ్యర్తి ఎవరనే దానిపై చంద్రబాబు నాయుడికి భూమాకుటుంబంనుంచి గట్టి షాక్ తగిలందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఇన్నాల్లు బాబు అడుతున్న నాటకానికి భూమా అఖిల ప్రియ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారే వార్తులు ఇప్పుడ హాట్గా మారాయి.
టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుపై మంత్రి భూమా అఖిల ప్రియ గుర్రుగా ఉన్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈవార్త ప్రింట్,ఎలక్ట్రానిక్,సోషియల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీనుంచి గెలిచి తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీ వలే భూమానాగిరెడ్డి గుండెపోటుతో మరనించడంతో ఉప ఎన్నిక అని వార్యమయ్యింది.
వచ్చేనెల జూన్లో నంద్యాల ఉప ఎన్నికను నిర్వహిస్తామని ఈ.సీ. ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక టికెట్ మాకంటే మాకేనని భూమా,శిల్పా వర్గాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.అయితే శిల్పా మోహన్రెడ్డికి టికెట్ ఇస్తే టీడీపీ పార్టీకీ రాజీనామ చేస్తామని మాజీ మంత్రి ఫరూక్ అబ్దుల్లా టీడీపీ అధినేతకు సంకేతాలిచ్చారు.దీంతో నంద్యల ఉప ఎన్నిక అభ్యర్తిని వాయిదావేస్తూ వస్తున్నారు చంద్రబాబునాయుడు.ఈ మధ్యన విజయవాడలో పర్యటించిన మంత్రి అఖిల ప్రియ తన తల్లి వర్థంతి రోజు 24 న ఎన్నికల్లో ఎవరు పోటీచేస్తారో క్లారిటీ ఇస్తామని ప్రకటించారు.
కానీ కొన్ని రాజకీయ కారనాల వల్ల చంద్రబాబు ఒత్తిడితో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే ఉన్నట్లుండి అఖిలప్రియ బాబుతీరుపై ఉప్పెనలా ఎగిసిపడుతున్నారనీ వార్త సోషియల్ మీడియాలోతెగ హల్ చల్ చేస్తోంది. అఖిలప్రియకు నచ్చ జెప్పెందుకు పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో భేటీ అయ్యారు. అఖిల ప్రియతోపాటు మాజీ మంత్రి పరూక్ అబ్దుల్లాకూడా హాజరయ్యారు. నంద్యాల నియేజకవర్గం తన తండ్రి భూమా నాగిరెడ్డిదని… ఆస్థానం తమ కుటుంబానికే రావాలని మధ్యలో శిల్పా ఎవరనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శిల్పాకు సీటు కేటాయించే విషయంమీద ఎవరికీ ఏకాభిప్రాయంరాదన్నారు. తమ కుటుంబానికి చెందిన సీటుపై ఆయన పెత్తనం ఏంటని కళా వెంకట్రావ్పై ఫైర్ అవుతూ…ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఫైర్ అయ్యానే వార్తలు తెగ హల్ చేస్తున్నాయి.
Related