Sunday, May 19, 2024
- Advertisement -

చంద్రబాబు విదేశీ ప‌ర్య‌ట‌న త‌ర్వాతే నిర్ణ‌యం

- Advertisement -
Chandrababu will decide nandyal by poll candidate after tour

నంద్యాల ఉప ఎన్నిక టికెట్ అభ్య‌ర్తి వ్య‌వ‌హారం చంబ్ర‌బాబు నాయుడికే స‌వాల్‌గా మారింది. ఏకంగా ముఖ్యమంత్రి – పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగినప్పటికీ పరిష్కారం కాక‌పోగ సందిగ్థం మరికొంతకాలం కొనసాగేలా ఉంది. ఎన్ని సార్లు భూమా,శిల్పా వ‌ర్గాల‌తో సీనియ‌ర్లు చ‌ర్చ‌లు జ‌రిపినా కొలిక్కిరాలేదు.

ఇరు వ‌ర్గాలు సీటు మాకంటే మాకని ప‌ట్టువీడ‌క‌పోవ‌డంతో ఏంచేయాలో బాబ‌కు పాలుపోవ‌డంలేదు.ఆదివారం మ‌రోసారి ఇరు వ‌ర్గాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపినా ప్ర‌తిస్టంభ‌న కొన‌సాగుతోంది.
నంద్యాల ఉప ఎన్నిక టికెట్‌ తమకే కేటాయించాలంటూ ఇప్పటికే కోరిన శిల్పాబ్రదర్స్‌… ఆదివారం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. శిల్పామోహన్‌రెడ్డి తనకే టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ​‍’2014లో పార్టీ తరఫున నేనే పోటీ చేశా. ఈసారి కూడా టికెట్‌ నాకు ఇవ్వడమే న్యాయం. మేం అన్ని రకాలుగా నష్టపోయాం’ అని సీఎంను కలిసిన అనంతరం శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. ‘నంద్యాల సీటు మాకే ఇవ్వాలి’ అని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన వెల్లడించారు.
కాగా, మంత్రి భూమా అఖిలప్రియ సైతం ఈ వ్యవహారంపై నేడు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా అందరికంటే మంత్రి అఖిలప్రియ బాబుతో ఎక్కువ సేపు మాట్లాడారు. సంప్రదాయం ప్రకారం టికెట్‌ తమకే ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారు. సోదరుడు బ్రహ్మానందరెడ్డి అభ్యర్థిత్వంపై పట్టుపడుతున్న అఖిలకు బాబు నచ్చచెప్పారని అందుకే ఆమెతో అంతసేపు మాట్లాడారని పార్టీ వర్గాల సమాచారం. ఆఖరులో మాత్రం మీ నిర్ణయానికే వదిలేస్తున్నాని శిల్పా పంతానికి పోతున్నందుకే తానూ పంతానికి దిగవలసి వస్తోందని బాబుకు చెప్పినట్లు తెలిసింది. చివరకు అభ్యర్థిని ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖరారు చేద్దామని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే శిల్పా బ్రదర్స్ ను మరోమారు తనతో భేటీ కావాలలని బాబు సూచించినట్లు సమాచారం.
చివరకు అభ్యర్థిని ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖరారు చేద్దామని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే శిల్పా బ్రదర్స్ ను మరోమారు తనతో భేటీ కావాలలని బాబు సూచించినట్లు సమాచారం. దీంతో ఏం జరగనుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఏదో ఒక నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. టీడీపీ లో ప‌ర‌మానంద‌య్య శిశ్యులా..?
  2. చంద్ర‌బాబు వ్యూహానికి… శిల్పా,భూమా వ‌ర్గాలు మ‌టాషేనా..!
  3. ఉప ఎన్నికలకు ముందే.. అఖిల ప్రియకు చుక్కలు చూపిస్తున్నారు
  4. అనుచ‌రుల ఒత్తిడితో ఎటూతేల్చుకోలేక పోతున్న భూమాఅఖిల ప్రియారెడ్డి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -