Thursday, May 9, 2024
- Advertisement -

టీడీపీ లో ప‌ర‌మానంద‌య్య శిశ్యులా..?

- Advertisement -
Paramanandayya Sishyulu in TDP

ప‌ర‌మానంద‌య్య శిశ్యుల క‌థ‌లు విన‌ని వారుండ‌రు. క‌థ‌లు ఎంత పాపుల‌ర‌రో ….. ఆయ‌న శిశ్యులు ఎంత మేధావులో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వాల్లు చేసిన ఘ‌న‌కార్యాల‌ను మ‌నం క‌థ‌లు, సినిమాల్లో చూసె వుంటాం. ఇప్పుడు నిజంగానే చూస్తున్నాం. ఏంటీ ప‌ర‌మానంద‌య్య శిశ్యులు అన‌కుంటున్నారా ..అవును మీరు విన్న‌ది నిజ‌మే.. అర‌మానంద‌య్య శిశ్యులు లాంటి వారు ఎక్క‌డో కాదు టీడీపీ లో ఉన్నారు. ఈపాటికి వాల్లు ఎవ‌రో మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంది.

అలాంటి వాల్ల‌లో మొద‌టిగా చెప్పుకోద‌గిన‌వారు విజ‌య‌వాడ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్‌. ఒక్క సంఘ‌ట‌న కొంద‌రి జీవితాల్నే మార్చేస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ద‌శాబ్దాలుగా ఉన్న రాని పాపులారిటీ …ఒక్క పూట‌లో వ‌చ్చేస్తుంది. థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అనే డైలాగు సినిమా యాక్ట‌ర్ పృద్వీకి ఎంత పేరు తెచ్చిపెట్టిందో అంద‌రికీ తెలిసిందే. మొన్నా మ‌ధ్య యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంట‌ర్యూలో విజ‌య‌వాడ ఎమ్మెల్యేల జ‌లీల్‌ఖాన్ బీకాంలో ఫిజిక్స్ ఎపిసోడ్ తెలుసుగా .. ఒక్క బీకాం పిజిక్స్ డైలాగ్‌తో ఆయ‌న‌కు విప‌రీత‌మైన పాపులారిటీ వ‌చ్చింది.
ఇక ఐటీ,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లోకేష్‌. ఆయ‌న ప్ర‌తిభాపాట‌వాలు ఎలాంటివో మొత్తం దేశంలో అంద‌రికీ తెలిసింది. ఆంబేత్క‌ర్ జ‌యంత‌కి వ‌ర్థంతి శుభాకాంక్ష‌లు తెలిపిన ఘ‌నుడు. అనంత‌పురంలో జ‌రిగిన స‌భ‌లో 2019 ఎన్నిక‌ల్లో 200 సీట్లు గెల‌వాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అంతేనా ఇంకా రెచ్చిపోయారు. జ‌గ‌న్ ప‌ది సంవ‌త్స‌రాలుగా సీఎంగా ఉన్న‌ప్పుడు ఎన్ని ప‌రిశ్ర‌మ‌లు తెచ్చారో చెప్పండ‌ని కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌శ్నించారు.
ఇలా చెప్ప‌కుంటే పోతే భీమ‌వ‌రం ఎమ్మెల్యే రామాంజ‌నేయులు గ‌త 20 సంవ‌త్స‌రాలుగా అన్న‌మే తిన‌ట్లేద‌ని ప్ర‌జ‌ల‌కు షాక్ ఇచ్చారు. ఆవిష‌యం పెద్ద‌గా విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌క‌పోయినా అదెలా సాధ్యమ‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్త‌డం స‌హ‌జం. ఇప్పుడు తాజాగా ఎస్‌వీ మోహ‌న్ రెడ్డి యూట్యూబ్ చాన‌ల్‌కు ఇంట‌ర్వూ ఇచ్చారు. అక్క‌డ యాంక‌ర్ ఇంట‌ర్‌లో ఏంచ‌దివార‌ని అడ‌గ్గా అంద‌రికీ దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఆయ‌న ఇంట‌ర్ చ‌దివే రోజుల్లో ఎంపీసీ,ఎంపీటీసీలు ఉండేవి కాదంట‌…. అప్పుడు అంతా జ‌న‌ర‌లేనంట‌….. జ‌స్ట్ సివిక్స్‌,సివిల్ మాత్ర‌మే ఉండేవ‌ట‌… అందుక‌ని డిగ్రీలోకూడా సివిక్స్ తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్ప‌గా ..ఆయాంక‌ర్ కంగుతి డిగ్ర‌లో సీఈసీ ఉండద‌ని ప్ర‌శ్నించ‌గా ఇంకేముంది ఆఎమ్మెల్యే తెల్ల‌ముఖం పెట్టారు.ఇదండి బీకాంలో సివిక్స్ సంగ‌తి.
వీల్లేకాదండోయ్ ఇంకొక‌రు ఉన్నారు.ఆయ‌న ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ‌రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బాబు క్ర‌మ శిక్ష‌ణా రాహిత్యం వ‌ల్లే గెలిచాని సెల‌విచ్చారు. చూశారుగా టీడీపీలో ప‌ర‌మానందయ్య శిశ్యుల కంటె ఎలాంటి మేధావులు ఉన్నారో .ఇప్ప‌టి వ‌ర‌కు వీల్లే భ‌య‌ట‌ప‌డ్డారు.పార్టీలో ఇంకెంత మంది ప‌ర‌మానందయ్య శిశ్యులు ఉన్నారో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}fSxkIqVtahY{/youtube}

Also Read

  1. లోకేష్, జలీల్.. ఇద్దరూ ఇద్దరే..
  2. లోకేష్, జలీల్.. ఇద్దరూ ఇద్దరే..
  3. బీకామ్‌ ఫిజిక్స్‌ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన జగన్
  4. బీకాంలో ఫిజిక్స్‌ ఎమ్మెల్యే పై రోజా కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -