ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మరణం.. తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని.. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దశాబ్దాల పాటు దాసరి తెలుగు సినీ రంగానికి ఎన్నో సెవలు చేశారని.. పెద్ద దిక్కుగా ఉన్నారని.. సినీ రంగంలో ఆయన ఒక యుగకర్త అని జగన్ పేర్కొన్నారు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఏ దర్శకులు సాధంచలేని రికార్డులను దర్శకరత్న సాధించారని.. 150కి పైగా సినిమాలను డైరెక్ట్ చేయడమే కాకుండా.. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పత్రికాధిపతిగా, మంచి మనిషిగా దాసరి ఎప్పటికీ చిరస్మరణీయులని వైఎస్ జగన్ అన్నారు. దాసరి తెలుగు సినిమా రంగంలతో ఒక విప్లవాన్ని సృష్టించారని, కథే హీరోగా ఆయన తిరుగులేని చిత్రాలను నిర్మించారని పేర్కొన్నారు. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
{youtube}WN0c4_qXhb8{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related