Saturday, April 27, 2024
- Advertisement -

మహర్షి కొత్త ప్రయోగాన్ని అభిమానులు స్వీకరిస్తారా?

- Advertisement -

మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకం గా నటించిన చిత్రం మహర్షి. ఈ సినిమా మొదలు అయినా దగ్గర నుండి విడుదల అయేంత వరకు ఒక మంచి పాజిటివ్ బజ్ ఉండేలా చూసుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా విడుదల అయినా తరుణం లో సినిమా కి లెన్త్ ఎక్కువ ఉంది అని చాలా మంది కంప్లైన్ చేశారు. అయితే సినిమా దర్శకుడు వంశీ మాత్రం సినిమా కి ఈ లెన్త్ సరైనదే అని జస్టిఫై చేసుకున్నాడు.

అయితే ఇప్పుడు మహర్షి టీమ్ ఒక కొత్త ప్రయోగం చేయబోతుంది. ఉన్న మూడు గంటల నిడివి కి మరో పది నిమిషాల సీన్స్ ని జత చేయనున్నారు నిర్మాతలు. సినిమా లో కొన్ని ముఖ్యమయిన సన్నివేశాలని మేకర్స్ ఫైనల్ కట్ నుండి తొలగించారట. ఇప్పుడు సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చినందున మేకర్స్ ఇప్పుడు ఆ సీన్లని యాడ్ చేసి అభిమానులకి సర్ప్రైజ్ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే సినిమా లో ఇప్పటికే చాలా సీన్లు ఉన్నాయి అని అందరూ చెప్తున్నా వినకుండా సీన్లని యాడ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏ ధైర్యం తో ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు అని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -