Friday, April 26, 2024
- Advertisement -

24 ఏళ్ల తర్వాత అఖిల్ కి అమ్మగా మారబోతున్న నటి

- Advertisement -

‘అఖిల్’ సినిమాతో హీరోగా పరిచయమైన అక్కినేని అఖిల్ మొదటి మూడు సినిమాలతో మంచి హిట్ ను నమోదు చేసుకోలేక పోయాడు. తాజాగా విడుదలైన ‘మిస్టర్ మజ్ను’ కూడా డిజాస్టర్ గా మారడంతో తన ఆశలన్ని 4వ సినిమాపైనే పెట్టుకున్నాడు ఈ యువహీరో. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే లాంచ అయిన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. తాజా సమాచారం ప్రకారం సీనియర్ నటి ఆమని ఈ సినిమాలో అఖిల్ అమ్మ పాత్రలో కనిపించబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకుముందు ఆమని ‘సిసింద్రీ’ సినిమాలో అఖిల్ తల్లిగా కనిపించిన సంగతి తెలిసిందే. అంటే దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ తల్లి కొడుకులు గా మారబోతున్నారు అన్నమాట. ఈ సినిమా హీరోయిన్ గా కియారా అద్వానీ మరియు రష్మిక మందన్న పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. మరి కనీసం ఈ సినిమాతో అయినా అక్కినేని అఖిల్ మంచి హిట్ ను నమోదు అందుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -