Saturday, April 27, 2024
- Advertisement -

అనసూయ న్యూడ్ ఫొటో అంటూ వైరల్.. కేసు పెట్టిన అనసూయ..!

- Advertisement -

యాంకర్ అనసూయకు తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈమె కొద్ది కాలంలోనే స్టార్ యాంకర్ గా ఎదిగింది. బుల్లితెరపై జబర్దస్త్ తో పాటు మరికొన్ని షోస్ చేస్తూ.. కొన్ని షోస్ కు జడ్జీగా కూడా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా సినిమాల్లో కూడా నటిస్తోంది.

క్షణం, సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం వంటి సినిమాల్లో నటించింది. మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా.. కొందరు పనిగట్టుకుని తనపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ వేధిస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను అనసూయ ఆశ్రయించింది. ఇటీవల కొంత కాలంగా తన చిత్రాలను మార్ఫింగ్ చేసి అప్ లోడ్ చేస్తున్నారని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

తన సోషల్ మీడియా ఖాతాలకు వచ్చిన కామెంట్లను జతచేస్తూ, అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ విభాగం, దర్యాఫ్తును ప్రారంభించింది. కాగా, ఇటీవలి కాలంలో అనసూయ న్యూడ్ ఫొటో అంటూ, ఓ చిత్రం హల్ చల్ చేయగా, అది తన చిత్రం కాదని వివరణ ఇస్తూ, ఒరిజినల్ చిత్రాన్ని ఆమె విడుదల చేసిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -