Saturday, April 27, 2024
- Advertisement -

500 మందితో ఇంట‌ర్వెల్ ఫైట్ ప్లాన్ చేస్తున్న రామ్ చ‌ర‌ణ్‌

- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో విన‌య విధేయ రామ సినిమా చేస్తున్నాడు.బోయ‌పాటి సినిమా అంటే ఫుల్ మాస్‌గా ఉంటుందని వేరేగా చెప్పాల్సిన ప‌ని లేదు.ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్,ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్ప‌న్స్ వ‌చ్చింది.తాజాగాఈ సినిమా గురించి మ‌రో ఆప్టెడ్ వ‌చ్చింది.సినిమాలోని కీలక ఫైట్‌ను దాదాపు 500 మంది ఫైట‌ర్స్‌తో చిత్రిక‌రించ‌నున్నార‌ని స‌మాచారం.ఈ ఫైట్ సినిమా ఇంట‌ర్వెల్‌లో వ‌స్తుందట‌.ఇంటర్వెల్ బ్యాంగ్ కావడంతో, ఈ యాక్షన్ ఎపిసోడ్ ను ఒక రేంజ్ లో చిత్రీకరించారట.

చరణ్ తో పాటు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా ఈ యాక్షన్ ఎపిసోడ్ ను బోయపాటి తనదైన శైలిలో చిత్రీకరించినట్టుగా చెబుతున్నారు. ఈ ఫైట్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంద‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా భ‌ర‌త్ అనే నేను బ్యూటీ కియారా అద్వానీ న‌టిస్తుంది.సినిమారు సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్‌. ఈ సినిమా త‌రువాత రామ్ చ‌ర‌ణ్ రాజ‌మౌళి,ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కునున్న RRR సినిమాకి షిఫ్ట్ అవుతాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -