వైస్సార్సీపీ తరపున నగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండో సారి ఎమ్మెల్యే గా గెలిచినా సినీ నటి రోజా కి జగన్ కాబినెట్ లో స్పీకర్ పదవి కానీ మంత్రి పదవి కానీ రావచ్చని కోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ దశ లో ఆ రెండిటిలో ఏది జరిగినా రోజా ఫుల్ గా బిజీ అవ్వడం ఖాయం. అలాంటి పరిస్థితి లో రోజా జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావాల్సిన అవసరం వస్తుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. రోజా ని ఎప్పటికప్పుడు విమర్శలు చేయడానికి టీడీపీ నేతలు రెడీ గా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆమెకి ఏదైనా పదవి దక్కితే కచ్చితంగా దానిని జబర్దస్త్ కి ముడిపెట్టి కానీ వదిలి పెట్టారు అనేది రోజా దగ్గరి వ్యక్తులు చెప్తున్నారు.
ఈ దశ లో రోజా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పడమే మంచిదని. మంత్రి పదవి కన్నా జబర్దస్త్ పెద్ద గొప్పది ఏమి కాదని అందరూ రోజా కి సలహా ఇస్తున్నారు. అయితే ఇదంతా మీడియా లో జరుగుతున్న ప్రచారం. కానీ నిజానికి అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద క్లారిటీ రావాలంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.