టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరు #మీటూ ఉద్యమం గురించే మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం #మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతుంది.మహిళలు ఇండస్ట్రీలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.తాజాగా మరో భామ తనకు ఎదుర్కొన్న అనుభవం గురించి చెప్పుకొచ్చింది.పంజాబీ ముద్దుగుమ్మ నికిషా పటేల్.. పవన్ నటించిన ‘కొమరం పులి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. సినిమా ఫ్లాప్ కావడంతో నికిషాకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత తమిళనాట తన అధృష్టాన్నిపరీక్షించుకుంది.
అప్పట్లో ఈ భామపై చాలానే రూమర్స్ వినిపించాయి. క్రికెటర్ శ్రీశాంత్ తో ఆమె రిలేషన్ లో ఉందనే వార్తలు బలంగా వినిపించేవి. అయితే దీని గురించి శ్రీశాంత్ కానీ నికిషా కానీ ఎప్పుడూ పెదవి విప్పలేదు.తరువాత శ్రీశాంత్ , భువనేశ్వరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.తాను ఏడాది పాటు శ్రీశాంత్ తో సహజీవనం చేసినట్లు నికిషా బయటపెట్టింది. శ్రీశాంత్ తో బ్రేకప్ అయిన తరువాత ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నట్లు, అయితే శ్రీశాంత్ నిజాన్ని దాచడం తట్టుకోలేకపోతున్నానని నికిషా చెప్పుకొచ్చింది.