Saturday, April 27, 2024
- Advertisement -

భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్న పూజ హెగ్డే

- Advertisement -

హాట్ బ్యూటీ పూజ హెగ్డే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘అల వైకుంఠ పురం లో’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తో పూజ హెగ్డే రెండవసారి బన్నీతో రొమాన్స్ చేయబోతోంది. మరోవైపు ఈమె మెగా హీరో వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈమె చేతిలో బోలెడు ఆఫర్లు ఉన్న ఈ స్టార్ హీరోయిన్ మరొక పెద్ద ప్రాజెక్ట్ ని సైన్ చేసినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం పలు హీరోయిన్లను అనుకున్నప్పటికీ తాజాగా పూజ హెగ్డే ని ఫైనలైజ్ చేశారట. అయితే ఈ సినిమా కోసం పూజ హెగ్డే భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ అడిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఏ హీరోయిన్ తీసుకోనంత భారీ మొత్తాన్ని పూజా హెగ్డే ఈ ఒక్క సినిమా కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెమ్యునరేషన్ గురించి ఎప్పుడు మాట్లాడినప్పటికీ అది నిర్మాతలు చేతిలోనే ఉందని ఆ ప్రశ్నని దాటేస్తూ ఉంటుంది ఈ భామ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -