మెగా మేనల్లుడుగా ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్లో వరుస హిట్లు సాధించి మామయ్యకు తగ్గ హీరోగా అనిపించుకున్నాడు. అచ్చం చిరంజీవి మ్యానరిజంతో మెగా ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్లో హీరోయిన్ రెజీనాతో వరుసగా రెండు సినిమాల్లో నటించాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ,‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. పైగా ఈ సినిమాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పుకార్లు బయటికి వచ్చాయి. దానికి తగినట్లుగా వీరిద్దరు బయట కాఫీ షాపుల్లో, పబ్ల్లో కనిపించారు.
దీంతో వీరు ప్రేమలో ఉన్నారని అందరు భావించారు.కానీ ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే వారిద్దరూ కలిసి కనిపించలేదు. తాజాగా రెజీనాతో ప్రేమ వ్యవహారంపై డైరెక్ట్ స్పందించాడు సాయి ధరమ్ తేజ్. గతంలో నాకు రెజీనాకు ఏదో ఉంది అంటూ మీడియా పుకార్లను పుట్టించింది. పుకార్ల వల్ల తన కెరీర్ కి ఏమైనా చెడు జరుగుతుందేమో అని భావించి నేనే తనకు దూరం అయ్యాను. ఇలాంటి రూమర్స్ వల్ల మా ఇద్దరి మధ్య స్నేహం చెడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అలా చేయాల్సి వచ్చింది.
నా ఫస్ట్ హీరోయిన్, ఫస్ట్ దర్శకుడు, ఫస్ట్ నిర్మాత నాకు ఎంతోగానో స్పెషల్ అని చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఈ మ్యాటర్లో ఎక్కడ కూడా రెజీనా పేరు చెప్పకపోవడం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ చిత్ర లహరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్కు ఈ సినిమా అయిన హిట్ ఇస్తుందేమో చూడాలి.