Friday, April 26, 2024
- Advertisement -

టీడీపీ ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరిన మంచు విష్ణు…

- Advertisement -

ఫీజురీయంబర్స్ మెంట్ బ‌కాయిలు చెల్లించ‌లేద‌ని విద్యానికేత‌న్ విద్యాసంస్థ‌ల అధినేత మోహ‌న్ బాబు ఉద‌యం తిరుప‌తిలో ద‌ర్నా నిర్వ‌హించారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు సంబంధించిన ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ ను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని ఆరోపించారు. నిధులు విడుద‌ల చేయాల‌ని ఎన్ని సార్లు లేఖ‌లు రాసినా ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ వ్వ‌వ‌హారంపై మంచు వ‌ష్ణు ఘాటుగా స్పందించారు. ఫీజు రీ ఇంబర్స్మెంట్ గురించి ఎన్నోసార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప‌ట్టించుకోలేద‌న్నారు. బకాయి పడ్డ ఆరు కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వడంలేదు చెప్పడం లేదని అన్నారు. అటు చీఫ్ సెక్రెటరీ రావత్ కు కూడా అనేకమార్లు లేఖలు రాసినట్టు మంచు విష్ణు తెలిపారు. ఆలేఖ‌ల‌న్నీ ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్నాయ‌న్నారు. తమకు రావలసిన దానికంటే ఒక్కరూపాయి ఎక్కువ తీసుకున్నట్టు చూపించినా.. ఆస్తులు అమ్మి వాళ్ళ పార్టీ కి ఫండ్ కింద ఇస్తామని స‌వాల్ చేశారు. ఈ సవాల్ కు మీరు సిద్దమేనా అంటూ విష్ణు ప‌రోక్షంగా బాబును ప్ర‌శ్నించారు. ప్రతి రూపాయికి తమవద్ద అకౌంట్స్ ఉన్నాయని.. ఈ విషయంపై ఆర్టీఐ ను అడిగినా స్పష్టమైన సమాధానం వస్తుందని విష్ణు తెలిపారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -