Saturday, April 27, 2024
- Advertisement -

రాజమండ్రి లోని థియేటర్ ను కొనుగోలు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్

- Advertisement -

ఈ మధ్యకాలంలో దర్శకుల దగ్గర నుంచి హీరోల వరకు అందరూ కేవలం సినిమాల ను మాత్రమే నమ్ముకోకుండా బిజినెస్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో భాగస్వామ్యం ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు మరొక వ్యాపారాన్ని మొదలు పెట్టారు. తాజా సమాచారం ప్రకారం రాజమండ్రి దగ్గరలో రాజనగరం రాయుడు అని కాంప్లెక్స్ థియేటర్ ను కొనుగోలు చేశారట. ఇక సినిమాల పరంగా చూస్తే త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘అల వైకుంఠ పురం లో’ సినిమాతో బిజీగా ఉన్నారు.

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. ‘డిజె’ సినిమాలో బన్నీ తో రొమాన్స్ చేసిన పూజ హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న టబు మరియు హీరో సుశాంత్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించడం విశేషం. గీత ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ పథకాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్యనే జెమినీ టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకున్నరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -