Friday, April 26, 2024
- Advertisement -

శంకర్ దాదా సక్సెస్.. హీరోలందరు కలిసిన వేళ.. ఫోటో వైరల్..!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ అందరు ఒకే దగ్గర చేరడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైన ఏదైన ఫంక్షన్స్ లో తప్పిస్తే కలవరు. వీరంతా ఒక్కచోట చేరితే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ హీరోలు అందరు ఒకే దగ్గర చేరితే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. ఇప్పటి హీరోలు ఒకరి ఆడియో ఫంక్షన్లకు మరొకరు గెస్టులకు వెళుతూ సినీప్రియులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ కల్చర్ ఇప్పటిది కాదు.

గతంలోనూ ఇది ఉంది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి జనాల్లోకి వెళ్లలేదు. ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ చిత్రం విడుదలై 2020 అక్టోబర్ 15 నాటికి సరిగ్గా 16ఏళ్లు పూర్తవుతోంది. ఈ మూవీని దర్శకుడు సి.పర్జానీ జయంతి తెరకెక్కించగా దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా చేయగా.. ఏటీఎంగా శ్రీకాంత్ నటించారు.

ఈ సినిమా భారీ విజయం సాధించడంతో చిత్రయూనిట్ అప్పట్లో సక్సస్ మీట్ నిర్వహించింది. దీనిలో నాటి యంగ్ హీరోలంతా హాజరవడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు.. రెబల్ స్టార్ ప్రభాస్.. లవర్ బాయ్ తరుణ్.. హీరో శ్రీకాంత్.. సుమంత్ పాల్గొన్నారు. మెగాస్టార్ పక్కనే మహేష్ బాబు నిల్చోగా.. హీరో శ్రీకాంత్ పక్కన ప్రభాస్ ఉన్నారు. మహేష్ బాబు.. ప్రభాస్ ఇద్దరు కూడా నాటి ట్రెండ్ కు తగ్గట్టు డ్రెస్సింగ్ చేసుకున్నారు. వీరితోపాటు దర్శకుడు జయంత్.. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ తన సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెట్టాడే..?

శాకుంతలం తర్వాత గుణశేఖర్ సినిమా అదే..?

వకీల్ సాబ్ షూటింగ్ పై క్లారిటీ వచ్చినట్టేనా..?

రవితేజ ఆ కథను ఒప్పుకున్నాడా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -