Friday, April 26, 2024
- Advertisement -

అక్కడ ఉండేది జగన్….కేంద్రం పప్పులు ఉడకవు

- Advertisement -

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకోసం తను అనుకున్న పని సాధించడంకోసం ఎంతదూరమైనా వెల్తారు. చేస్తున్న పనులు మంచివైతె కేంద్రాన్ని కూడా లెక్కచేయని మక్కుసూటి మనిషి. వందరోజుల పాలనలోనె తను ఏంటో నిరూపించుకున్నారు జగన్. తను తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఇతర రాష్ట్రాల్లో వేడి పుట్టిస్తున్నాయి. బాబు హయాంలో భారీ ప్రాజెక్టుల్లో జరిగన అవకతవకలను సరిచేస్తూ కొత్తగా టెండర్లను పిలుస్తూ ముందుకు సాగుతున్నారు.

పీపీఏల ఒప్పందాలను సమీంచాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పీపీఏలనేటివి తేనె తుట్టేలాంటివి. వాటిని ఒక సారి కదిలిస్తే కేంద్రంలో భూప్రకంపనలే మొదలవుతాయి. అవన్నీ కేంద్రంతో ముడిపడిన ప్రాజెక్టులు. జగన్ మాదిరిగానే పీపీఏల పునః సమీక్షకు ఇతర రాష్ట్రాలు పట్టుబడితే కేంద్రానికి చిక్కులు తప్పవు. అందుకే జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కేంద్రం గుర్రుగా ఉంది.

పోలవరం విషయంలో కూడా జగన్ .. కంద్రాన్ని లెక్క చేయలేదు. రీటెండర్లును నిర్వహంచవద్దని కేంద్రంనుంచి ఘాటుగా లేఖలు వచ్చినా వాటన్నింటిని జగన్ చెత్త బుట్టలో పడేశారు. కేంద్రం నుంచి వార్నింగ్ లు వస్తున్నా జగన్ బెదరడంలేదు. తను చేయాలనుకున్నది చేస్తున్నారు. దీంతో జగన్ వైఖరి పట్ల కేంద్రం ఆసక్తికరంగా స్పందిస్తుంది.

దేశంలో చాలా మంది సీఎంలు ఉన్నా జగన్ లాంటి మొండి వైఖరి ఉన్న సీఎం ను చూడలేదని .. జగన్ ఎవరి మాట వినే రకం కాదని వ్యాఖ్యానిస్తునట్టు సమాచారం. నిజానికి కేంద్రంలో ఏపార్టీ ఉన్నా దానికి అనుగునంగా నడుచుకోవాల్సిందే. ప్రస్తుతం కేంద్రంలో పూర్తి మెజారిటీతో బీజేపీ బలమైన పార్టీగా ఉంది. పైగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి వేరే సీఎం అయితే కేంద్రం చెప్పినట్టు చేసి ఉండే వారు. కానీ అలా వింటే జగన్ ఎందుకు అవుతారు.

కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీనే లెక్క చేయలేదు. ఇక బీజేపీని ఏం లెక్కచేస్తాడని మాటలు కేంద్రంలో జోరుగా వినిపిస్తున్నాయంట. పోలవరంలో విషయంలో నవయుగ కంపెనీకి ఉద్వాసన పలుకుతూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఒక పక్క హై కోర్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును ఇచ్చినా జగన్ తాను అనుకున్న దానికి కట్టుబడి రీటెండరింగ్ కే మొగ్గుచూపారు.ముఖ్యంగా పోలవరం విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను కేంద్రం పదే, పదే వద్దని హెచ్చరిస్తున్నా సీఎం మాత్రం వాటన్నింటిని ఖాతర్ చేయడంలేదు.

పీపీఏల ఒప్పందం గురించి ఏకంగా కేంద్ర మంత్రి జగన్ కు లేఖ రాశారు. పీపీఏ ఒప్పందాల వల్ల పెట్టుబడులు ఆగిపోతాయని .. అయితే ఇప్పుడు పోలవరం విషయంలో కేంద్రం గట్టిగానే స్పందిస్తుంది. ముఖ్యంగా పోలవరం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్రం చాలా సీరియస్ గా ఉందని తెలుస్తుంది. అయినా కూడా నా రూటే సెపరేట్ అనే మాదిరిగా జగన్ ముందుకెల్తున్నారు.అవినీతి లేకుండా చేయాలని చూస్తున్న జగన్ కు ఇకనైనా కేంద్రం సపోర్ట్ చేస్తె బాగుటుంది. లేక పోతె అక్కడ ఉండేది జగమొండి జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -