Saturday, April 27, 2024
- Advertisement -

యాంకర్ రవి ఔట్.. శ్రీముఖి ఇన్.. మళ్లీ పటాస్ లో రచ్చ..!

- Advertisement -

పటాస్ కామెడీ షోకు అంత క్రేజ్ వచ్చిందంటే అందుకు ముఖ్య కారణం యాంకర్ రవి, శ్రీముఖిల కెమిస్ట్రీ. అయితే ఉన్నట్లుంది ఈ షో నుంచి వారిద్దరు తప్పుకోవడంతో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. బిగ్ బాస్ ఛాన్స్ వస్తే శ్రీముఖి తప్పుకుంది. తాజాగా రవి కూడా తప్పుకున్నాడు. దాంతో ఇప్పుడు పటాస్ పరిస్థితి ఏంటో అర్దం కావడం లేదు.

ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కొద్దిమంది ఫీమేల్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. సుమ రేసులోంచి పక్కనబెడితే రెండోస్థానంలో అనసూయ.. తర్వాత రష్మీ.. తర్వాత శ్రీముఖ్ది ఉంది. బిగ్ బాస్ తర్వాత ఈమెకు క్రేజ్ మరింత పెరిగిపోయింది. బిగ్ బాస్ వెళ్లకముందే పటాస్ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. యాంకర్ రవితో గొడవల కారణంగానే ఆమె తప్పుకుందనే ప్రచారం కూడా జరిగింది.

బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత పటాస్ మళ్లీ చేస్తారా అంటే రవితో యాంకరింగ్ చేయడానికి మా నాన్నను అడగాలంటూ శ్రీముఖి చెప్పడం మరో సంచలనం. ఇప్పుడు రవి కూడా పటాస్ ను వదిలేయడంతో శ్రీముఖి మళ్లీ వస్తుందనే ప్రచారం మొదలైంది. ఇప్పుడు రవి స్థానంలో చలాకీ చంటి హోస్ట్ చేస్తున్నాడు. దాంతో శ్రీముఖి మళ్లీ ఈ షోకి యాంకర్ గా వస్తుందని తెలుస్తోంది.

ప్రస్తుతం వర్షిణి హోస్ట్ చేస్తుండటంతో ఆమెను తప్పించి శ్రీముఖిని తీసుకోవాలని చూస్తున్నారు మల్లెమాల ప్రొడక్షన్స్. పైగా చలాకీ చంటితో శ్రీముఖికి మంచి ర్యాపో కూడా ఉంది. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -