Saturday, April 27, 2024
- Advertisement -

రాహుల్ అంటే శ్రీముఖికి అంత కోపమా ?

- Advertisement -

బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ ఇటీవలే ముగిసింది. అందరు ఊహించినట్లే ఎక్కువ ఓట్లు గెల్చుకుని రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఇక శ్రీముఖి రెండో స్థానంలో నిలిచింది. ఇక రాహుల్ కంటే అన్ని విషయాల్లో తనే బెటర్ అనుకున్న శ్రీముఖి రన్నరప్ కే పరిమితం కావడం జీర్ణించుకోలేకపోతుంది. ప్రేక్షకుల సమక్షంలోనే తన మనసులోని మాటను బయటకు చెప్పింది. హోస్ట్ నాగార్జున రాహుల్ ను విన్నర్ గా ప్రకటించిన తర్వాత.. ఫస్ట్ శ్రీముఖిని మాట్లాడమని సూచించాడు.

శ్రీముఖి మాట్లాడుతూ.. “ఓటమ్నిని ఎవరూ ఇష్టపడరు. ప్రధానంగా నేను” అంటూ తన బాధను చెప్పింది. అయితే టైటిల్ గెల్చుకోకున్న ఎంతోమంది హృదయాలను గెల్చుకున్నానంటూ చెప్పింది. ఇదే విషయంపై చిరంజీవి మాట్లాడుతూ.. “రాహుల్ చెక్ మాత్రమే తీసుకున్నాడు. కానీ నువ్వు కొన్ని కోట్ల హృదయాలను గెల్చుకున్నావు” అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇక ప్రజలు రాహుల్ ను గెల్పించడంను శ్రీముఖి గౌరవించినట్టు లేదు. ‘విధిరాత, అదృష్టం ఉంటే గెలుపు దక్కేది’ అని ఆమె బిగ్‌బాస్‌ వేదికపై చెప్పుకొచ్చింది.

అంటే రాహుల్ ఏం చేయకపోయినా కేవలం లవ్ వల్లే గెలిచాడు అన్నట్లు మాట్లాడింది. ఫస్ట్ నుంచి టైటిల్ తనదే అని ఫిక్స్ అయిన శ్రీముఖికి రాహుల్ విజయం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. విన్నర్ గా నెగ్గిన రాహుల్ కి శ్రీముఖి కనీసం ‎కృతజ్ఞతలు కూడా చెప్పకపోవడంపై నెటిజన్లు శ్రీముఖిని విమర్శిస్తున్నారు. గెలుపు ఓటమిలు సహజం కాబట్టి గెల్చిన వారికి ‎కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి అన్నట్లు నెటిజన్లు శ్రీముఖిపై ఫైర్ అవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -