Saturday, April 27, 2024
- Advertisement -

అబ్బా.. అనసూయ కోరిక తీరింది..!

- Advertisement -

తెలుగు బుల్లితెర పై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుని తన గ్లామర్ తో కుర్రకారు గుండెళ్ళో గుబులు రేపుతోంది అనసూయ. ఈమె బుల్లితెరపై మెరుస్తూనే సినిమాల్లో కూడా రాణిస్తోంది. అనసూయ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. కొన్ని సార్లు ఆమె చేసే ట్వీట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయి.

అయితే కరోనా కారణంగా తాను కూడా అర్ధిక ఇబ్బందులు పడతామని మా పరిస్థితి ఏంటి ? మేము కూడా ఈఎంఐ లు కట్టుకోవాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి మాకు ఖర్చులు ఉన్నాయి అని అనసూయ ట్వీట్ చేసింది. దాంతో ఆమెపై దారుణంగా ట్రోల్స్ పడ్డాయి. ఓ పక్క ప్రాణాలు పోతుంటే నీకు డబ్బులు కావాలా ? అంటూ అనసూయపై ఘోరంగా కామెంట్స్ చేశారు నెటిజన్లు. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న ఒక నిర్ణయం ప్రతీ నెల నెలా ఇన్స్టాల్మెంట్లు కట్టుకునే వారికి కాస్త ఊరటనిచ్చింది.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా ఒక మూడు నెలల వరకు ఎవరూ ఈఎంఐ లు కట్టనవసరం లేదని సంచలన నిర్ణయం తీసుకోవడంతో యావత్తు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. దీంతో అనసూయ లేవలెత్తిన అంశమే సాల్వ్ కావడంతో మరోసారి అనసూయపై నెటిజన్లు ఫన్నీ ట్రోల్స్ వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -